హైదరాబాద్ : దేవాదుల ఎస్సారెస్పీ కాలువల నిర్మాణంపై పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్ సమీక్ష నిర్వహించారు. ఖైతరాబాద్ జిల్లా పరిషత్లోని తన పేషీలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈఎన్సీ మురళీధర్, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఇంజినీర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్రావు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగు నీరు అందిచేలా కృషి జరగాలని, ఇందులో భాగంగా దేవాదుల ఎస్సారెస్పీ కాలువ నీటిని అందించడంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
దేవాదుల ప్రాజెక్టు కాలువ ద్వారా నిర్మితమయ్యే మూడు రిజర్వాయర్ల ద్వారా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని 36 గ్రామాలకు మొత్తం 45,055 ఎకరాల ఆయకట్టుకు సాగనీరు అందుతుందన్నారు. దేవాదుల ప్రాజెక్టు కింద నిర్మితమయ్యే నష్కల్ – ఉప్పుగల్ రిజర్వాయర్ కింద బమ్మెర, కొండాపురం, వావిలాల, మల్లంపల్లి, దర్దేపల్లి ముత్తారం, తిరుమలాయపల్లి, కొండూరు, కేశవాపురం, గన్నారం, కొలను పల్లి, కాట్రపల్లి, పోతిరెడ్డిపల్లి, బురహాన్పల్లి, అవుతాపురం, గంట్లకుంట, పోచంపల్లి, చిన్న వంగర, ఏడునూతుల, రేగుల గ్రామాలు ఉండగా, 25,652 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు.
పాలకుర్తి రిజర్వాయర్ కింద దర్దేపల్లి, లక్ష్మీనారాయణపురం, ముత్తారం, విస్నూరు, పాలకుర్తి, వల్మీడి, చెన్నూరు, మంచుప్పుల, తీగారం, ఏడునూతుల గ్రామాలు ఉండగా మొత్తం ఆయకట్టు 7,515 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చెన్నూరు రిజర్వాయర్ కింద చెన్నూరు, మంచుప్పు ల, లక్ష్మక్కపల్లి, రామవరం, పాఖాల, మోండ్రాయి, కొడకండ్ల, మన్పహాడ్, దేవరుప్పుల, ధర్మపురం గ్రామాల్లో 11,888 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందన్నారు.
ఇందుకు ఉప్పుగల్లు, పాలకుర్తి, చెన్నూరు, రిజర్వాయర్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. జాఫర్గఢ్, పాలకుర్తి చెరువులను రిజర్వాయర్లు గా చేస్తున్నామన్నారు. పాలకుర్తి నియోజవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, మండలాల్లో ఇంకా కొన్ని గ్రామాలకు నీరు అందించాల్సి ఉందన్నారు. ఎండాకాలంలోనే నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భూసేకరణ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని, కాలువ క్లియర్ చేసి అలైన్మెంట్ సరి చేయాలన్నారు. శాశ్వత ప్రాతిపాదికన చెరువులు నింపేలా పనులు పూర్తి చేయాలని, కెనాల్స్ క్రాసింగ్ వద్ద మిషన్ భగీరథ పైపు లైన్లను షిప్ట్ చేయాలన్నారు. ఆయా పనుల కోసం ప్రత్యేకంగా ఇంజినీరింగ్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలని ఆదేశించారు. కాలువలు, రిజర్వాయర్లు, భూ సేకరణ, లైనింగ్, వంటి అంశాల పై మంత్రి సమీక్షించారు. అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది, కాంట్రాక్టర్లు, ఆయా పనుల్లో ఎలాంటి అలసత్వం వహించినా సహించేది లేదన్నారు. రెండు నెలల్లో చెరువులలోకి నీరు రావాలని మంత్రి ఆదేశించారు.