హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్సీ, ఐఐటీ (చుక్కా) రామయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనంగా సత్కరించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి శనివారం చుక్కా రామయ్యను హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆయన ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఆనాటి పోరాట స్మృతులను నెమరు వేసుకుంటూ, ఆనాటి అమరుల త్యాగాలను కీర్తిస్తూ, విలీన దినోత్సవాన్ని తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలు, ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న మూడు రోజుల వేడుకలు, ఏడాది పాటు నిర్వహించే ఇతర కార్యక్రమాలను మంత్రి రామయ్యకు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లిని చుక్కా రామయ్య అభినందించారు. గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వయోభారంతో కూడిన అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్యను జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా చుక్కా రామయ్యను మంత్రి ఘనంగా సత్కరించారు.