హైదరాబాద్ : నూతనంగా బాధ్యతలు చేపట్టిన వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ పాటిమీది జగన్ మోహన్ రావు, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
సీఎం కేసీఆర్ ఎంతో నమ్మకంతో అప్పగించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎం నమ్మకాన్ని నిలబెడుతూ.. తమ పదవులకు మంచి పేరు తేవాలని మంత్రి ఎర్రబెల్లి ఆకాంక్షించారు.