హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి చైర్మన్ గా గతంలోనూ సమర్థవంతంగా సభను నిర్వహించారని, ఈ సారి కూడా బాగా రాణించాలని ఆకాంక్షించారు.