హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా మరో సారి ఎన్నికైనా కేసీఆర్కు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ని పార్టీ అధ్యక్షునిగా ఎన్నుకున్న పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, మంత్రులకు, జెడ్పీ చైర్మన్లు, జడ్పీ చైర్ పర్సన్ లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించిన అన్ని విభాగాల కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికీ మంత్రి ఎర్రబెల్లి ధన్యవాదాలు తెలిపారు. అలాగే చేవెళ్ల ఎంపీ జి.రంజిత్ రెడ్డి కూడా సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు.