హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ( Minister Errabelli) అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో ఉపాధి హామీ పథకం , పంచాయతీరాజ్ శాఖ పనితీరుపై సమీక్ష (Review ) సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జాతీయ ఉపాధి పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 12 కోట్ల పనిదినాలు వచ్చే అవకాశముందని వెల్లడించారు. దీని ద్వారా అందరికీ ఉపాధి ( Employment ) లభిస్తుందన్నారు. పనిదినాల ద్వారా వచ్చే మెటీరియల్ కంపోనెంట్ తో అవసరమైన చోట నూతన గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించడానికి నిధులు ఖర్చు చేయాలని ఉన్నతాధికారులను అదేశించారు.
పీఆర్ ఇంజినీరంగ్లో అర్హులకు పదోన్నతులు
పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో అర్హులైన అందరికీ పదోన్నతులు ( Promotions ) త్వరలోనే వస్తాయని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా 750 పోస్టులు కూడా వస్తాయని వివరించారు. త్వరలో వాటికి నోటిఫికేషన్ ( Notification ) విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ ( CM KCR ) ఆదేశాల మేరకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపుపై కమిటీ వేయగా, కమిటీ తన పనులు ప్రారంభించిదన్నారు. వారి నివేదికల మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను విడుతల వారీగా పర్మినెంట్ చేస్తామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్లు సమీక్షలో పాల్గొన్నారు.
మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
అమెరికా పర్యటన ముగించుకొని గురువారం హైదరాబాద్కు చేరుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ను ఎమ్మెల్యే లు టి రాజయ్య, చల్లా ధర్మా రెడ్డి, రమావత్ రవీంద్ర కుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ కె. వెంకటేశ్వర్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్లానియా, కమిషనర్ హనుమంతరావు, స్పెషల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అధికారులు మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.