తెలంగాణలో పండిన ఈ యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందేనని వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మున్సిపాలిటీ, మండలపరిషత్, గ్రామ పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ తీర్మానం కాపీలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు గురువారం సంబంధిత ప్రజాప్రతినిధులు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ, తెలంగాణపై కేంద్ర సర్కారు కక్ష కట్టిందన్నారు. పంజాబ్లో ధాన్యం కొంటూ.. తెలంగాణపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ కోసం చేసినట్టుగా మహోద్యమం చేసి, కేంద్రం మెడలు వంచుతామన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజా కొనేదాకా వదిలిపెట్టబోమన్నారు.