హైదరాబాద్ : సర్వాయి పాపన్న తెలంగాణ వీరుడు, ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. అతి సామాన్యమైన జీవితం నుంచి అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మంత్రి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో ఉన్న నాటి సర్వాయి పాపన్న రాజభవనాలను కాపాడే పనిని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నదన్నారు. వాటి సంరక్షణకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామన్నారు.
సీఎం కేసీఆర్ సర్వాయి పాపన్న స్ఫూర్తిగా, బడుగుల ఆశాజ్యోతిగా, అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. బడుగుల విద్యావ్యాప్తికి గురుకులాలను ప్రారంభించారన్నారు. బడుగుల ఆత్మగౌరవ ప్రతీకగా హైదరాబాద్లో అన్ని కుల, సామాజిక వర్గాలకు ప్రత్యేక భవనాలను నిర్మిస్తున్నారన్నారు. కులాల, కుల వృత్తుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారన్నారు. స్థానిక సంస్థల్లో బడుగులకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. అలాగే కల్లుగీత వృత్తిని సైతం గౌరవ ప్రదమైన స్థానంలో నిలిపిన ఘతన కేసీఆర్కే దక్కుతుందని మంత్రి పేర్కొన్నారు.