Minister Dayakar Rao | సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో అత్యద్భుతమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెద్దవంగర మండల కేంద్రంలో వివిధ ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిరుపేదల సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోతో ప్రతిపక్షాల్లో వణుకు పుడుతోందని, ఉద్యమ నేతగా నిరుపేదల కష్టాలు తెలిసిన కేసీఆర్ మేనిఫెస్టోతో పాటు మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో ప్రతి సామాజిక వర్గానికి ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా.. ఎన్నో విధాల పథకాలను అందించారన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదలకు అందించిన పథకాలే.. మూడోసారి కేసీఆర్కు పట్టంకట్టడం ఖాయమన్నారు. 60ఏళ్లు పాలించి ఆగం చేసి కొత్తగా ఏదో చేస్తామంటే ఎలా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరని హక్కుల కోసం ఉద్యమాలు చేసిన ప్రజలని పేర్కొన్నారు.
రైతులకు సైతం రుణమాఫీ కొంత ఆలస్యమైందని, ఏ ఒక్క రైతుకు రుణమాఫీ ఆగదని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల గెలుపు ఖాయమని, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీవేనని, గెలుపు ఖాయమని, అధిక మెజార్టీ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. 12 అసెంబ్లీ స్థానాలను అధిక మెజారిటీతో గెలిపించి.. సీఎం కేసీఆర్కు అందిస్తామన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎవరు వచ్చినా పోటీకి సిద్ధమని.. పాలకుర్తి ప్రజలకు కష్టకాలంలో అండగా నిలిచానని.. అదే రీతిలో కష్టకాలంలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు గెలిపించి ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర, తొర్రూర్, పాలకుర్తి మండలాలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎర్రబెల్లి దయాకర్రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.