హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు పనితనంతో రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రూ.2.14కోట్ల విలువైన కొత్త సిటీస్కాన్ను ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీస్కాన్ మిషన్ పనితీరు తదితర వివరాలపై సూపరింటెండెంట్, టెక్నీషియన్స్ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వరంగల్ను హెల్త్హబ్గా ప్రకటించిందని, హైదరాబాద్ తర్వాత ఆ స్థాయి వైద్యసదుపాయాలు వరంగల్లో ఏర్పాటవుతున్నాయన్నారు. ఈ సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని, అదే తరహాలో ఇక్కడ వైద్యసేవలు నిరంతరం అందాలని ప్రజలతో పాటు ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఎంజీఎం డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని, అందుకే ఎంజీఎంలు అత్యవసర, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యసవర విభాగంలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ ద్వారా అత్యవసర చికిత్సలు అందించేందుకు వీలవుతుందన్నారు.
ఇప్పటికే ఆసుపత్రులో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. పాత సెంట్రల్ జైలు స్థలంలో రూ.1100కోట్లతో 24 అంతస్తుల అత్యాధునిక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే వరంగల్లో ప్రపంచస్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కలెక్టర్ గోపి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వలపదాసు చంద్రశేఖర్ పాల్గొన్నారు.