హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ భూస్థాపితమేనని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, ఎగ్గే మల్లేశంతో కలిసి టీఆర్ఎల్పీ కార్యాలయంలో మీడితో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్లో నిన్న రేవంత్రెడ్డి ప్రెస్మీట్ పెట్టి.. తెలంగాణను హేళన చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ధీనమైన స్థితిలో ఉందని, ఆ పార్టీ శవయాత్ర జరుగుతోందన్నారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తెలిసిందన్నారు. రేవంత్ బీజేపీలో ఉన్న సమయంలో ఆ పార్టీ లేవలేదని, టీఆర్ఎస్ నుంచి రేవంత్ వెళ్లగానే పార్టీ బాగుపడిందన్నారు.
టీడీపీ రేవంత్తో ఖతమైందని, కాంగ్రెస్లోకి రేవంత్రెడ్డి రాక ముందుకు కొన్ని సీట్లు వచ్చాయని.. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే కాంగ్రెస్కు వచ్చేవి సున్నా స్థానాలేనని, ఇది రాసిపెట్టుకోవాలన్నారు. టీడీపీలో మేం తెలంగాణ కోసం కొట్లాడుతుంటే.. రేవంత్ చంద్రబాబు ఏజెంట్గా పని చేశారని, రేవంత్ ఎక్కడ కాలు పెడితే అక్కడ భూస్థాపితమేనన్నారు. కాంగ్రెస్లోనే రేవంత్కు ఎవరూ విలువనివ్వడం లేదని, బయట ఇంకెవ్వరైనా ఇస్తారా ? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం రేవంత్ చేసింది ఏమైనా ఉందా?.. కాంగ్రెస్ హయాంలో సాగునీరు, తాగునీటికి కటకట ఉండేదని, ఇపుడు తెలంగాణలో ఆ సమస్యలు ఉన్నాయా? అన్నారు.
తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ అనీ, రైతుల కోసం పని చేసింది ఇద్దరు ముఖ్యమంత్రులేనన్నారు. ఇందులో ఒకరు ఎన్టీఆర్ అయితే.. మరుకొరు కేసీఆర్ అన్నారు. రైతుబంధు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతుల కోసం ఇప్పటి దాకా నువ్వు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. సిగ్గు లేకుండా రైతు సంఘర్షణ పేరిట సభ పెడుతున్నారని, ముందు కాంగ్రెస్లో కొట్టుకు చస్తున్న వారి సంగతి చూడు అంటూ హితవు పలికారు. రైస్ మిల్లర్లను కేంద్రం వేధిస్తూ రైతుల నుంచి ధాన్యం కొనకుండా కక్ష గట్టిందని, కిషన్ రెడ్డికి రేవంత్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. రేవంత్ వాళ్లతోనే రైతులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఇకనైనా రేవంత్ భాష మార్చుకోవాలని హితవు పలికారు.