Road Accident | హన్మకొండ జిల్లా ఆత్మకూరు – కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై వరంగల్ సీపీ రంగనాథ్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు.
మృతుల కుటుంబానికి సంతాపం ప్రకటించారు. వరంగల్ కాశీబుగ్గకు చెందిన ఎనిమిది మంది కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆత్మకూరు – కటాక్షపూర్ వద్ద టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరి పరిస్థితి సైతం విషమంగా ఉన్నది.