హైదరాబాద్ : వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి(State Level)లో ఉత్తమ అవార్డు(Award)ను సాధించిన గ్రామ పంచాయతీ సభ్యులను రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అభినందనలు తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా(Mahaboobnagar ) హన్వాడ మండలం కోనగట్టుపల్లి గ్రామం రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైంది. వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, హరితహారం(Haritaharam) లో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం, నిత్యం చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించడం, సామాజిక భద్రత అంశంలో అవార్డును దక్కించుకుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలోని తన కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మానస బసిరెడ్డి, ఉప సర్పంచ్ సందీప్ రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు శ్రీనివాస్, జనార్ధన్, లక్ష్మణ్, దేవేందర్, చెన్నయ్య, బాలకృష్ణ, పంచాయతీ సెక్రెటరీ శ్రీను, ఫీల్డ్ అసిస్టెంట్లు రాజు, బాలరాజు లను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో హన్వాడ మండలం జడ్పీటీసీ విజయనిర్మల రమణారెడ్డి, ఎంపీపీ బాలరాజు ముదిరాజ్, వైస్ ఎంపీపీ లక్ష్మీ మోహన్ నాయక్, ఎంపీటీసీ చెన్నయ్య, కోనగట్టుపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు కుర్మయ్య, బీఆర్ఎస్ హన్వాడ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ కృష్ణయ్య గౌడ్, ఎంపీడీవో ధనంజయ్, బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.