హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మైనింగ్ రంగంలో సాంకేతిక వినియోగానికి ప్రముఖ ఇంజినీర్ డాక్టర్ ఇనుముల సత్యనారాయణ విశేష కృషి చేశారని మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కే మధుసూదన కొనియాడారు. అసోసియేషన్ ప్రతి ఏటా ప్రదానం చేసే ఎస్ఆర్జీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవార్డు-2021, మైనింగ్ రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై ఆయన రాసిన వ్యాసానికి డాక్టర్ ఎంఎల్ జాన్వర్ పురసారానికి ఎంపిక చేసినట్టు తెలిపారు. ఎస్ఆర్జీ కన్సల్టింగ్ మైనింగ్ ఇంజినీర్స్ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్లయిన దివంగత రామ్ శ్రీనివాస్, ప్రదీప్కుమార్ భట్టాచార్య జ్ఞాపకార్థం ప్రతిఏటా మైనింగ్ రంగంలో సేవలు అందిస్తున్న ఇంజినీర్లకు అందజేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఏడాది తెలంగాణ ప్రాంతానికి చెందిన, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీగా ఒడిశాలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సత్యనారాయణను ఈ ప్రతిష్ఠాత్మక పురసారాలు వరించాయని చెప్పారు. శనివారం బెంగళూరులో నిర్వహించిన జాతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో సత్యనారాయణకు ఈ పురసారాలను ప్రదానం చేశారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహం, సింగరేణి సంస్థలో సాధించిన అనుభవం ఎంతగానో దోహదపడిందన్నారు. కార్యక్రమంలో ఎంఈఏఐ జనరల్ సెక్రటరీ నర్సయ్య, ఎంఈఏఐ హైదరాబాద్ చాప్టర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎస్ వెంకట్రామయ్య, సెక్రటరీ బీ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.