హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన చట్టం పరిధిలోకి తీసుకొచ్చింది. దీంతో పలు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు శ్రమకు తగిన వేతనం లభించనున్నది. కనీస వేతన చట్టం-1948లో ఇప్పటివరకు 73 రకాల పరిశ్రమలు ఉండగా, పార్ట్-1లో ‘ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అండ్ ఫుడ్ పార్క్స్’ను 74వ పరిశ్రమగా చేర్చుతూ కార్మిక, ఉపాధి కల్పన శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.