హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): ఈ నెల 17న జాతీయ సమైక్యతా దినం నిర్వహించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాం డ్చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్కు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్టు శనివారం మీడియాకు తెలిపారు. తమ పార్టీ ఆధ్వర్యంలో పాతబస్తీలో ఆ రోజు తిరంగా యాత్ర జరిపి, బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా పాల్గొంటారని, సీఎం కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు.
హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగం కావడానికి హిందువులు, ముస్లింలు అందరూ కలిసి పోరాడారని గుర్తు చేశారు. కాగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల దినం ప్రకటించాలన్న తమ ప్రస్తావనను అంగీకరించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్తున్నట్టు ఒవైసీ ట్వీట్ చేశారు.