KCR | హైదరాబాద్ : సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అక్బరుద్దీన్. కేసీఆర్ త్వరగా కోలుకోని ప్రజా సేవలోకి రావాలని అక్బరుద్దీన్ ఆకాంక్షించారు.
కేసీఆర్ను చంద్రబాబు, చిరంజీవి, ప్రకాశ్ రాజ్, భట్టి విక్రమార్క, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులుతో పాటు పలువురు నాయకులు పరామర్శించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ కాలు జారి కింద పడడంతో ఆయనకు హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్నారు. మరో ఐదారు వారాల పాటు కేసీఆర్కు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు.