హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ): బడ్జెట్ పుస్తకం పూర్తిగా తప్పుల తడకగా ఉందని, లెక్కలు ఒకదానికి ఒకటి పొంతనే లేదని ప్రభుత్వాన్ని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బురుద్దీన్ ఒవైసీ తూర్పార పట్టారు. గణాంకాలతో నిలదీశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై అసెంబ్లీలో బుధవారం కొనసాగిన చర్చలోఎంఐఎం తరపున అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు.
సాగునీటిశాఖ, విద్యుత్ సంస్థల డిస్కమ్లకు, వైద్యారోగ్యశాఖకు కేటాయించిన నిధుల్లో తేడాలు ఉన్నాయని, ఆ లెక్కలకు పొంతన లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.