హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం అందింది. తమ సదస్సులో ప్రసంగించాలని అమెరికాకు చెందిన మిల్కెన్ ఇనిస్టిట్యూట్ కేటీఆర్కు ఆహ్వానం పంపింది. లాస్ ఏంజిల్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు మిల్కెన్ ఇనిస్టిట్యూట్ 25వ వార్షిక సదస్సు జరగనుంది. సెలబ్రేటింగ్ ద పవర్ ఆఫ్ కనెక్షన్ పేరుతో సదస్సును నిర్వహించనున్నారు.
ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించినందుకు మిల్కెన్ ఇనిస్టిట్యూట్కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత ప్రపంచ ప్రముఖులకు కలిసేందుకు ఇది మంచి వేదిక అని కేటీఆర్ పేర్కొన్నారు.