హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఏపీలోని చిత్తూరు జిల్లాలో నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించింది. దీంతో జనం ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం అని తెలుసుకొని భయాందోళనలకు గురయ్యారు.
చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. గుంటూరు, గంగవరం మం డలం బండమీద జరావారిపల్లి, కీలపట్ల, నలసానిపల్లి, గాంధీనగర్, కురప్పల్లి ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో 3 సార్లు భూమి కంపించింది. సమాచారం అందుకున్న అధికారులు బుధవారం గ్రామాలకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకొన్నారు.