పుణె: ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్. ఈ మ్యాచ్తో ఇండియా తరఫున కృనాల్ పాండ్యా, ప్రసిద్ధ్ కృష్ణ వన్డే అరంగేట్రం చేస్తున్నారు. పుణె పిచ్ బ్యాటింగ్కు అనుకూలించనుందని పిచ్ రిపోర్ట్ సందర్భంగా అజిత్ అగార్కర్ చెప్పాడు. కోహ్లి చెప్పినట్లే ఈ మ్యాచ్లో రోహిత్, ధావనే ఓపెనింగ్ చేయనున్నారు. రాహుల్, అయ్యర్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.