న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ: టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లోకి వలసల జోరు కొనసాగుతున్నది. మునుగోడు నియోజకవర్గవ్యాప్తం గా శనివారం వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో గులాబీ గూటికిచేరారు. మునుగో డు మండలం చొల్లేడుకు చెందిన 40 కుటుంబాలు, ఇద్దరు వార్డు సభ్యులు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నా రు.
మర్రిగూడ మండలం దామెరభీమనపల్లికి చెందిన బీజేపీ మండల ప్రధానకార్యదర్శి అంబాల రమేశ్గౌడ్ సహా 200 మంది కాంగ్రె స్, బీజేపీ కార్యకర్తలు, గ్రామస్థులు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. నాంపల్లి మండలంచిట్టంపహాడ్లో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 50 మంది కార్యకర్తలు మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చౌటుప్పల్ మం డలంలోని అంకిరెడ్డిగూడెంలో బీజేపీ మండల కార్యదర్శి గంగిరెడ్డి మంజుల 10 మంది అనుచరులతో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, ఆయిల్ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో కారు ఎక్కారు.
వివిధ పార్టీల నుంచి మరో వంద మంది గులాబీ గూటికి చేరారు. చండూ రు మండలం పడమటితాళ్లలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 50 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ సమక్షంలో ఎల్లగిరిలో వివిధ పార్టీలకు చెంది న 30 మంది నాయకులు, కార్యకర్తలు గులా బీ పార్టీలో చేరారు.
మునుగోడు మండలం పలివెలలో కాంగ్రెస్కు చెందిన 1, 10వ వార్డు సభ్యులు మార్త నవనీతా నర్సిరెడ్డి, గోసుకొండ ముత్తయ్యతోపాటు పలువురు.. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి ఐదో వార్డుకు చెందిన 30 మంది యువకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మునుగోడు మండలంలోని చల్మడ గ్రామంలో ఎమ్మెల్యే చర్ల ధర్మారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వేమిరెడ్డి నరసింహారెడ్డి సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు 100 మంది టీఆర్ఎస్లో చేరారు. కొంపెల్లి గ్రామంలో పలు పార్టీలకు చెందిన దళిత కుటుంబాలు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.