హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): మహాలక్ష్మి పథకం వల్ల బస్సుల్లో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఆర్టీసీ కొత్త వ్యూహం పన్నింది. ముఖ్యంగా బస్సు ల్లో కూర్చునేందుకు సీట్ల సమస్య ఎక్కువైంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధి బస్సుల్లో మెట్రో రైలులో మాదిరిగానే సీట్ల మార్పు చేసింది. ఈ మేరకు కొన్ని బస్సులను ప్రయోగాత్మకంగా రంగంలోకి ప్రవేశపెట్టారు. ఈ విధానం విజయవంతమైతే హైదరాబాద్లోని అన్ని సిటీ బస్సుల్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే, ఈ కొత్త విధానం ఎలాంటి ఫలితాలిస్తుందో చూడాలి.