హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో మరింత సౌకర్యవంతమైన ప్రయాణానికి ఆర్టీసీ, మెట్రోరైల్ సంస్థల మధ్య శనివారం అవగాహన ఒప్పందం కుదిరింది. మెట్రో రైలు దిగగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా సర్వీసులు నడిపేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు.
శనివారం బస్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎల్అండ్టీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ మురళీవరదరాజన్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రిషికుమార్ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఒప్పందంలో భాగంగా మెట్రోస్టేషన్లను అనుసంధానిస్తూ బస్సులను నడపడం, సర్వీసుల సమయ పట్టిక, సూచికబోర్డులు ఏర్పాటు చేస్తామని సజ్జనార్ తెలిపారు. మెట్రోస్టేషన్ల వద్ద సమాచార కేంద్రాలు, అనౌన్స్మెంట్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీతో మెట్రో అనుసంధానం ప్రజా రవాణాలో కీలక అడుగు అని ఎల్అండ్టీ ప్రతినిధులు పేర్కొన్నారు.