హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఇష్టారాజ్యంగా కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ( Pattolla Karthik Reddy ) దుయ్యబట్టారు. రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని ( Pattolla Karthik Reddy) హైదరాబాద్ కార్పొరేషన్లో కలపడం దుర్మార్గమని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల రాజేంద్రనగర్ నియోజక వర్గం తన అస్తిత్వాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. రాజకీయ పరంగా, అబివృద్ధి పరంగా నష్టపోతుందని అన్నారు. నియోజక వర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపవద్దని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ప్రభుత్వం మొండిగా వ్యవహరించిందని ఆరోపించారు. ఎవరికోసం చేస్తున్నది స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో దుర్మార్గంగా కలిపారు
ఈ నిర్ణయం వల్ల రాజేంద్రనగర్ నియోజకవర్గం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.. రాజకీయ పరంగా, అబివృద్ధి పరంగా నష్టపోతుంది
రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ కార్పొరేషన్లో కలపకూడదని మేము రెండు నెలల ముందు… https://t.co/mRvBdXiIoh pic.twitter.com/24at2PFsYn
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2026