హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లోని మహిళా సహాయక సంఘాలు(ఎస్హెచ్జీలు) తయారుచేసే ఉత్పత్తులకు బ్రాండింగ్తోపాటు డిజిటల్ మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు మెప్మా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయించి ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేయించాలని నిర్ణయించారు. జిల్లా స్థాయి మెప్మా అధికారులు, డిస్ట్రిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్ (డీఎంసీ)లు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్ (ఏడీఎంసీ)లకు ఇటీవల హైదరాబాద్లోని నిమ్స్మేలో 5 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు.
అర్బన్ ఎస్హెచ్జీలు తయారుచేసే ఆహార ఉత్పత్తులు, ఇతర వస్తువులకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్సులు, ట్రేడ్ మార్కులు, ఎమ్మెస్ఎంఈ రిజిస్ట్రేషన్ లభించేలా చూడటంతోపాటు లోగోల తయారీ, ఆకర్షణీయమైన ప్యాకింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. వీరంతా తమ తమ జిల్లాలు, మున్సిపాలిటిల్లోని ఎస్హెచ్జీలకు శిక్షణ ఇస్తారు. ఎస్హెచ్జీల ఉత్పత్తులపై సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించడంతోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో తదితర ఆన్లైన్ సంస్థల ద్వారా అమ్మకాలను పెంచుకునేలా అవగాహన కల్పిస్తారు.