హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 ( నమస్తే తెలంగాణ ) : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 9న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి తెలిపారు.
సివిల్ క్రిమినల్ కేసులన్నింటికి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అదాలత్ ఉపయోగపడనున్నదని పేర్కొన్నారు. అన్ని రకాలైన ప్రిలిటిగేషన్స్, పెండింగ్ కేసులను పరిష్కరించనున్నట్టు వివరించారు.