హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా గురువారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ప్రగతిభవన్ చేరుకున్న సంగ్మాను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తేనీటి విందు ఆతిథ్యం ఇచ్చారు. ఇరువురు ముఖ్యమంత్రులు కాసేపు ఇష్టాగోష్టిగా చర్చించారు. అనంతరం సంగ్మా ను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కే వంశీధర్రావు తదతరులు పాల్గొన్నారు.