హైదరాబాద్ : మేఘా ఇంజనీరింగ్ సంస్థ థాయిలాండ్ నుంచి మరో 3 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను దిగుమతి చేసుకొని శుక్రవారం తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. ఆర్మీ ప్రత్యేక విమానంలో ఛంఢీఘడ్ నుండి నేరుగా బ్యాంకాక్ వెళ్లి అక్కడి నుంచి విమానంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ క్రయోజనిక్ ట్యాంకులను తీసుకువచ్చింది. వీటికి అదనంగా మరో 5 క్రయోజనిక్ ట్యాంకులు రెండు మూడు రోజుల్లో హైదరాబాద్కు చేరుకోనున్నాయి. మేఘా ఇప్పటికే గడిచిన శనివారం మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులను ప్రభుత్వానికి అందించిన సంగతి తెలిసిందే.
ఒక్కొక్క ట్యాంకులో 1.40 కోట్ల లీటర్ల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేయవచ్చు. ఆ విధంగా 11 ట్యాంకర్ల నుంచి ఒకేసారి 15 కోట్ల 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ సరఫరా చేయడం సాధ్యమవుతుంది. ఈ క్రయోజనిక్ ట్యాంకుల ద్వరా ఇతర రాష్ర్టలలోని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తీసుకువచ్చి నేరుగా ఆసుపత్రులకు అందచేయవచ్చు.