గోదావరిఖని, జూన్ 1: సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల కోసం ఈ నెల 13న సమావేశం నిర్వహించనున్నా రు. ప్రస్తుత గుర్తింపు కార్మిక సంఘమైన టీబీజీకేఎస్ కాలపరిమితి ఇప్పటికే ముగిసింది. ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేయడం, కొన్ని సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ తీర్పు ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు రీజినల్ లేబర్ కమిషనర్ కొంతకాలంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 13న మరోసారి సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు.