హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు సమస్యలపై బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఢిల్లీలో కేంద్ర రహదారులు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తులపై గడ్కరీ సానుకూలంగా స్పందించి అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసినట్టు ఎంపీలు పేర్కొన్నారు.
వినతిపత్రంలో కోరిన అంశాలు