పుణె, జూలై 19: ఆమె పారిశ్రామికవేత్తల కుటుంబంలో జన్మించలేదు. అయినా స్వయం శక్తితో పైకెదిగింది. అమెరికాలో ఉన్నత చదువు చదివి అక్కడే ఉద్యోగం చేస్తూ తర్వాత అంచెలంచెలుగా మిలియనర్ స్థాయికి చేరుకుంది. అయితే ఆమె ఒక్క ఏడాదే 8,600 కోట్ల రూపాయల సంపదను పోగొట్టుకుంది. ఆయినా ఆమె ఉక్కు సంకల్పం ముందు అది చిన్నమొత్తమే అయ్యింది. ఎదురుదెబ్బలు, అడ్డంకులకు వెరువక ఆమె వ్యాపార సామ్రాజ్యంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. ఆమెయే 38 ఏండ్ల నేహా నార్ఖేడే. పిన్న వయస్సులోనే దేశంలోనే అత్యంత ధనవంతురాలైన స్వయం శక్తి మహిళా వ్యాపారవేత్తగా నిలిచారు ఈ ఇండోఅమెరికన్. ప్రపంచంలోనే టెక్ కంపెనీల స్థాపనలో ఆమె అత్యంత ప్రభావవంతమైన మహిళగా పేరుగాంచారు. పుణెలో జన్మి ంచిన ఈమె ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియా కేంద్రంగా తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 2021లో ఈమె ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన మహిళల్లో 8వ స్థానంలో నిలిచారు.