రంగారెడ్డి జిల్లా కడ్తాల్ పిరమిడ్లో
తుదిశ్వాస విడిచిన ధ్యాన గురువు
కడ్తాల్, జూలై 24 : ధ్యాన గురువు ది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ (74) ఆదివారం సాయంత్రం కడ్తాల్లోని మహేశ్వర మహా పిరమిడ్లో తుదిశ్వాస విడిచారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా వేలాది పిరమిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ఆధ్యాత్మిక ధ్యానం వైపు నడిపించారు.
ఈయన నిజామాబాద్ జిల్లా బోధన్లోని శక్కర్ నగర్లో 1947లో రమణారావు, సావిత్రీదేవి దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం బోధన్, సికింద్రాబాద్లో కొనసాగింది. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్లో పూర్తి చేశారు. 1990లో కర్నూల్లో ధ్యానం కోసం బుద్ధజ్ఞాన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. క్రమంగా 50 వేలకుపైగా పిరమిడ్ కేంద్రాలను నిర్మించారు. 1974లో ఆయనకు వివాహం కాగా ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.