హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ ఫౌండేషన్ తెలంగాణలోని అనాథ పిల్లలకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. థర్డ్వేవ్లో పిల్లలు ఎక్కువగా వైరస్ బారిన పడుతారనే వార్తల నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కేఎస్సీఎఫ్ మెడికల్ కిట్లను అందించనున్నది. తెలంగాణ స్త్రీ,శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 150 అనాథ ఆశ్రమాలకు కొవిడ్కేర్ (మెడికల్) కిట్లను ఈ నెల 15న పంపిణీ చేయనున్నది. ఇప్పటికే వివిధ రాష్ర్టాల్లోఈ తరహా కిట్లను పంపిణీ చేసింది. ఒక్కో కిట్ రూ.3 లక్షల వరకు విలువ చేస్తుందని ఫౌండేషన్ తెలంగాణ సమన్వయకర్త చందన తెలిపారు.
కిట్లో ఇవి ఉంటాయి
1 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ (ఐదు లీటర్ల ఫ్లో), 2 ఆక్సీమీటర్లు, 1 నెబ్యులైజర్, 2 వేపోరైజర్లు, 10 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కిట్లు, 2 ప్యాకెట్ల గ్లోవ్స్, 150 మాస్కులు, 5 లీటర్ల శానిటైజర్.