హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జన్మదినం సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆయన శిష్యుడు, కేయూ జేఏసీ వైస్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి యువజన నాయకుడు మేడారపు సుధాకర్ సరికొత్త పంథాలో తన గురువుపై అభిమానాన్ని చాటుకున్నారు. తన రక్తంతో గీయించిన చిత్రపటాన్ని ఎర్రబెల్లికి గిఫ్ట్గా ఇచ్చాడు.
రాజకీయ గురువు అయిన ఎర్రబెల్లి దయాకర్ రావు పుట్టినరోజు తన పండుగ రోజు అని పేర్కొన్నాడు. అందుకే బ్లడ్ ఆర్ట్ వేయించానని చెప్పారు. మేడారపు సుధాకర్ ఆ బ్లడ్ ఆర్ట్ను బహూకరించగా ఎర్రబెల్లి మురిసిపోయారు. తనకు పుట్టినరోజు సందర్భంగా మరిచిపోలేని బహుమతి ఇచ్చావని అభినందించారు. సుధాకర్ను ఆలింగనం చేసుకుని ధన్యవాదాలు తెలియజేశారు.