వరంగల్ : తెలంగాణ మహా కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం మహాజాతర(Medaram Mahajatara) హుండీల లెక్కింపు(Hundis counting )హన్మకొండలోని(Hanmakonda) తితిదే కళ్యాణ మండపంలో గురువారం ప్రారంభమైంది. ఎండోమెంట్, రెవెన్యూ, జాతర ట్రస్ట్ బోర్డు సభ్యులు, పోలీసు సమక్షంలో హుండీలు తెరుచుకున్నాయి. 518 హుండీలను 10 రోజుల పాటు అధికారులు లెక్కించనున్నారు.
ఇందుకు గాను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల పహారా, సీసీ కెమెరాల (CC cameras) పర్యవేక్షణలో లెక్కింపు ప్రారంభమైంది. ఒడి బియ్యం, కరెన్సీ, నాణేలు, బంగారం, వెండిని వేర్వేరుగా లెక్కించనున్నారు. కాగా, ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరిగిన మేడారం జాతర విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే.