హైదరాబాద్ : మేడారం జాతర(Medaram Jathara) పనులన్నీ జనవరి 31 లోగా పూర్తి చేయాలని మంత్రులు(TS Ministers) అధికారులను ఆదేశించారు. శ్రీ సమ్మక-సారలమ్మ మహా జాతర 2024 ఏర్పాట్లు, నిర్వహణ గురించి మంగళవారం ఎంసీహెచ్ఆర్డీలో ఎర్పాటు చేసిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఈ సారి జాతర ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లు రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు మంజూరు చేశామన్నారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం చేసుకొని వెళ్లేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉచిత బస్ సౌకర్యంతోమహిళా భక్తులు పెరిగే అవకాశం ఉందని, ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.