ములుగు, ఫిబ్రవరి18 (నమస్తేతెలంగాణ): మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు జాతర సౌకర్యాలు, చరిత్ర గురించి ఆన్లైన్లో సెల్ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం ‘మై మేడారం యాప్’ను అందుబాటులోకి తెచ్చింది. ఇది భక్తులకు ఓ గైడ్గా పనిచేయనుంది. నాటి ఎడ్లబండి నుంచి గాలిమోటర్ వరకు వచ్చిన సౌకర్యాలతోపాటు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే జాతర విశేషాలు, ముఖ్యమైన ఘట్టాల సమాచారాన్ని ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ మేరకు శనివారం మంత్రి సీతక్కతోపాటు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ పీ శబరీష్ ‘మై మేడారం యాప్’ను ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్ ద్వారా ‘మై మేడారం గైడ్ 2024’ అనే పేరుతో అందుబాటులో ఉం ది. యాప్ ద్వారా జాతరలోని తాగునీటి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ ప్రాం తాలు, మరుగుదొడ్లు, స్నానఘట్టాల వివరాలు, తప్పిపోయిన వారి కోసం మైక్ల ద్వారా పిలిచే కేంద్రాలు, ఫైర్ ఇంజన్ కేం ద్రాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.