కంది, ఏప్రిల్ 20: సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ ఆ ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గురువారం హైదరాబాద్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఓడీఎఫ్కు వర్క్ ఆర్డర్స్ ఇవ్వకుండా కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సీజీహెచ్ఎస్ రీయింబర్స్మెంట్ ప్రయోజనాలను కాపాడాలని కోరారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి స్పందిస్తూ.. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానని హామీచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను విన్నవిస్తానని భరోసా కల్పించారు. ఆర్డినెన్స్ ఉద్యోగుల సమస్యలపై రక్షణ మంత్రితో చర్చిస్తామని తెలిపారు. వర్క్లోడ్ సాధించేందుకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఎంపీని కలిసిన వారిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తెలంగాణ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు, సలీమొద్దీన్, బండి శ్రీనివాస్, శివకుమార్, అశోక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వర కుమార్ తదితరులు ఉన్నారు.