మెదక్ మున్సిపాలిటీ, జనవరి 1 : మెదక్ చర్చి(Medak Church) సోమవారం భక్తులతో( Devotees) కిటకిటలాడింది. నూతన సంవత్సరం(New year) తొలి దినంతో కావడంతో వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, పర్యాటకులతో చర్చి ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పార్థనల అనంతరం చర్చి ప్రెసిబేటరీ ఇంచార్జి రెవరెండ్ శాంతయ్య భక్తులనుద్దేశించి దేవుని సందేశం చేశారు.
నూతన సంవత్సరంలో ప్రభువు దయతో అందరు సుఖ సంతోషాలు ఆనందోత్సవాలతో గడపలన్నారు. ప్రార్థనల్లో చర్చి పాస్టర్లు శ్రీనివాస్, డేవిడ్, జైపాల్, సువర్ణలు భక్తులను అశీర్వదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, సంశాన్ సందీప్, గెలెన్ చిత్తరంజన్, సువన్డగ్లస్, జాన్సన్, వికాస్, నోబుల్సన్, జాయ్ముర్రే, సుశీల్, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.