మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 29 : ప్రఖ్యాత మెదక్ చర్చి బిషప్ రెవరెండ్ సాల్మన్రాజ్ను సినాడ్ సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో ఇన్చార్జి బిషప్గా డోర్నకల్ చర్చి బిషప్ రెవరెండ్ పద్మారావు మంగళవారం సికింద్రాబాద్లోని డయాసిస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సాల్మన్రాజ్ 2028 వరకు బిషప్గా కొనసాగే అవకాశం ఉన్నది. అయితే ఇటీవల జరిగిన పాస్టరేట్ కమిటీ ఎన్నికల్లో జరిగిన అవకతవకల వల్లే ఆయన్ను సస్పెండ్ చేసినట్టు సమాచారం.