హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): యాసంగి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించి రైస్ మిల్లుల్లో ధాన్యం నాణ్యత ప్రమాణాలు దెబ్బతినకుం డా జాగ్రత్తలు తీసుకోవాలని మిల్లర్లను, జిల్లా అధికారులను పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. యాసంగి సీజన్ సీఎంఆర్ సేకరణ తదితరాలపై గురువారం పౌరసరఫరాలశాఖ భవన్లో కమిషనర్ అనిల్కుమార్, రైస్ మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. ఎఫ్సీఐ నుంచి ఎదురవుతున్న సమస్యల వల్ల బియ్యం అప్పగించడంలో జాప్యం జరుగుతున్నదని తెలిపారు. మిల్లుల్లోనే 70 శాతం ధాన్యం నిల్వలు ఉన్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ జోక్యంతో యాసంగికి సంబంధించి అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోవడానికి ఎఫ్సీఐ అంగీకరించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు మిల్లర్లు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, జీఎం రాజిరెడ్డి, కన్సల్టెంట్ అశోక్కుమార్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేందర్, మోహన్రెడ్డి పాల్గొన్నారు.