జగిత్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి 27: జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైన్స్లు, బార్లలో కింగ్ఫిషర్ కంపెనీకి చెందిన బీర్లు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కేంద్రానికి చెందిన బీరం రాజేశ్ అనే యువకుడు సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.
గతంలోనూ బీర్ల కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదని తెలిపాడు.