పటాన్చెరు/రామచంద్రాపురం, అక్టోబర్ 19: జమ్ముకశ్మీర్ సరిహద్దులో జాతీయ జెండా రెపరెపలాడటంతోపాటు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఫ్లెక్సీని ప్రదర్శించారు ఎండీఆర్ యువసేన సభ్యులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎం దేవేందర్రాజు అభిమానులు ఎండీఆర్ యువసేనను ఏర్పాటు చేసుకున్నారు. యువసేన సభ్యులు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో దేశసరిహద్దులోని లడఖ్ జిల్లా చివరిగ్రామం తాంగ్కు వెళ్లారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి చిత్రాలతో కూడిన బీఆర్ఎస్ ఫ్లెక్సీని మంగళవారం అక్కడ ప్రదర్శించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఆవిర్భవించిన సందర్భంలో సీఎం కేసీఆర్పై అభిమానంతో బార్డర్కు వచ్చామని వారు పేర్కొన్నారు. బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో రాణించాలని కోరుకుంటూ తాము సాహసం చేసి ఖర్దుంగ్ లా మంచుకొండల్లో మైనస్ డిగ్రీ సెల్సియస్లో, సముద్ర మట్టానికి 17,982 ఫీట్ల ఎత్తులో ఫ్లెక్సీని ప్రదర్శించినట్టు వారు తెలిపారు.