హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సిబ్బంది సంక్షేమంపై యాజమాన్యం ఎల్లప్పుడూ సానుకూలంగానే ఉందని ఎండీ నాగిరెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం ఆర్టీసీ కళాభవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతిలో ఆయన మాట్లాడారు. కార్మికులు, సిబ్బంది ఎవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని పరోక్షంగా ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి చెప్పారు. సిబ్బంది సమస్యలను పరిషరించడమే సంస్థ లక్ష్యమని ఆయన భరోసా ఇచ్చారు.
అంబేదర్ ఆశయాలకు అనుగుణంగా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒకరి భాగస్వామ్యం అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జేడీ నర్మద, ఈడీలు సీహెచ్ వెంకన్న, ఖుస్రోషాఖాన్, రాజశేఖర్, సాల్మన్, ఎఫ్ఏ విజయపుష్ప, సీటీఎం ఎంఅండ్సీ శ్రీధర్, సీపీఎం ఉషాదేవి, సీఈ(ఐటీ) శ్రీదేవి, రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత, ఎస్సీ, ఎస్టీ యూనియన్ చైర్మన్ రాజయ్యనాయక్, పలువురు ఆర్ఎంలు, అధికారులు పాల్గొన్నారు.