హైదరాబాద్,మార్చి 31(నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలోనే తొలిసారిగా ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీలో ఎండీ (డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్) కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)కి ఎమర్జెన్సీ మెడిసిన్లో ఐదు, నెఫ్రాలజీ ఐదు ఎండీ సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) మంజూరు చేసింది. ఈ మేర కు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 2023 -24 సంవత్సరం నుంచి ఈ కోర్సులను ప్రా రంభిస్తారు.
ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీలో ఎండీ కోర్సులు అందుబాటులోకి రావడం పట్ల మంత్రి హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య విద్య బలోపేతం అవుతున్నదనడానికి నిదర్శనమని చెప్పారు. కోర్సులు రావడానికి కృషి చేసిన డీఎంఈ విభాగాన్ని, కేఎంసీ సిబ్బందిని మంత్రి అభినందించారు.