హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాను సమర్థంగా ఉపయోగించుకోవాలని ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ శశాంక్ గోయల్ సూచించారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో లోక్సభ సెక్రటేరియట్ సీనియర్ ఆఫీసర్స్కు మీడియా మేనేజ్మెంట్పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచారం, అభిప్రాయం రెండు వేర్వేరని, ఈ రెండింటి గురించి తెలుసుకోవడం చాలా కీలకమైన అంశమని అన్నారు. వాస్తవం, ఊహించడం రెండు వేర్వేరని, వీటిపై అధికారులు అప్రమత్తంగా ఉంటూ గమనించాలని సూచించారు. జాతీయ అభివృద్ధికి ఉమ్మడి ఎజెండా కోసం పని చేసే అవకాశాలను అన్వేషించాలని పేర్కొన్నారు.