చిక్కడపల్లి, ఫిబ్రవరి 14: ఎంసీపీఐ(యూ) పొలిట్బ్యూరో సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి తాండ్రకుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన కొంతకాలంగా లివర్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ 4 రోజుల క్రితం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. తాండ్రకుమార్ భౌతికకాయాన్ని బాగ్లిగంపల్లిలోని ఓంకార్ భవన్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మియాపూర్లో తాండ్ర కుమార్ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన పార్టీ నేతలు వివరించారు. పలువురు వామపక్ష పార్టీల నేతలు తాండ్ర కుమార్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.