హైదరాబాద్, మే 2(నమస్తే తెలంగాణ): సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)ల నిర్వహణపై వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎంబీఏ-ఎంఎస్ఎంఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్టు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ (నిమ్స్మే) వర్గాలు తెలిపాయి.
మొదటి ఏడాది రెండు సెమిస్టర్లు భువనేశ్వర్లోని ఏఎస్బీఎం యూనివర్శిటీలో, రెండో సంవత్సరం రెండు సెమిస్టర్లు హైదరాబాద్లోని నిమ్స్మేలో నిర్వహిస్తామని వెల్లడించాయి. కోర్సు సమగ్ర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నాయి.