హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు దేశాన్ని చీకట్లోకి నెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని టీఎస్ ఫుడ్స్ సంస్థ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఆరోపించారు. దేశంలోని విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు నిల్వలు అడుగంటిపోతుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ఆయన శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. థర్మల్ కేంద్రాల్లో 20 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు అందుబాటులో ఉండాలనే నియమాన్ని కేంద్రం తుంగలోకి తొక్కిదని మండిపడ్డారు.
ఒకట్రెండు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉంచటం దారుణమని పేర్కొన్నారు. దేశంలో 150 ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నా వాటిని కాదని, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని ధర్మల్ కేంద్రాలపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తున్నదని ఆయన మండిపడ్డారు.